◆ ఇప్పటికే “కడప జిల్లాకు” చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టిడిపి ఖండువ కప్పుకున్నారు.
◆ కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీకాంత్ రెడ్డి టీడీపీలోకి చేరికలు
రాజకీయ ప్రస్థానం :- వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై విరక్తి చెందిన ముఖ్యనేతలు టిడిపి, జనసేన, కాంగ్రేస్ పార్టీలలో చేరుతున్నారన్నారు. వైసీపీ నాయకుల వలుసలతో ఇప్పటికే జగన్ రాజకీయ భవిష్యత్తు కాస్త అందకారంలోకి వెళ్లినట్లేనని పలు సర్వేలు, రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీ పార్టీలోని కీలక వ్యక్తి పెద్ది రెడ్డి తో ఉన్న మనస్పర్థలు ఇంకా ఒక కొలిక్కి రాలేదన్న సంగతి అన్నీ రాజకీయ పార్టీలకు అవగతమైన విషయమే.
■ ఇదిఇలా ఉంటే ప్రస్తుతం వైసీపీ గెలుపు గుర్రాలలోని మరో కీలక మంత్రి టిడిపి గూటికి చేరబోతున్నాడని తెలియడంతో వైఎస్ జగన్ పార్టీలో అంతర్మథనం మోదలైయ్యింది. వైసీపీ పార్టీలో ఆ మంత్రికి సంబంధించిన సామాజిక వర్గంలో కూడా చీలికలు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
◆ తాజాగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఎసి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారమే పార్టీలో చేరారడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు మూకుమ్మడిగా స్పష్టం చేయడం జరిగింది.
► Sree Prasthanam telugu Daily Newspaper | శ్రీ ప్రస్థానం సాయంత్రం తెలుగు దినపత్రిక